
ఖానాపూర్/ కడెం/ పెంబి, వెలుగు: ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు పొందవచ్చని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సూచించారు. కడెంకు చెందిన రైతు పండించిన ఆయిల్ పామ్ గెలల మొదటి కోతను శుక్రవారం పరిశీలించారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో ఆయిల్ పామ్సాగుపై సదస్సుకు హాజరై, మాట్లాడారు. ఆయిల్ పామ్ సాగు చేయాలనుకునే రైతులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ భూషణ్, అబ్దుల్ మాజిద్, మున్సిపల్ మాజీ చైర్మన్ సత్యం తదితరులున్నారు.
ఇందిరమ్మ ఇండ్లకు భూమిపూజ
పెంబి మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే బొజ్జు పటేల్శుక్రవారం భూమిపూజ చేశారు. ఫారెస్ట్ అధికారుల నుంచి అనుమతులు రాగానే కవ్వాల్ టైగర్ రిజర్వ్ ప్రాంత గ్రామాలకు ఇండ్లు మంజూరు చేస్తామని తెలిపారు. ఎంపీడీవో రమాకాంత్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు స్వప్నిల్ రెడ్డి పాల్గొన్నారు.
ఆలయాల అభివృద్ధికి కృషి
రాష్ట్ర ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తోందని ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అన్నారు. గోసంపల్లె తండాలో నిర్మించిన జగదాంబ మాతా, సంత్ సేవా లాల్ మహరాజ్ ఆలయంలో శుక్రవారం పూజలు చేశారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దయానంద్నా, నాయకులున్నారు.